మాజీ ప్రధానులపై కేంద్రం ప్రశంసలు

54చూసినవారు
మాజీ ప్రధానులపై కేంద్రం ప్రశంసలు
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. బుధవారం సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం.. 1991లో ఆర్థిక సరళీకరణను ప్రారంభించి, భారత ఆర్థికవ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ లను అభినందించింది. వారి నిర్ణయాల కారణంగా దేశంలో లైసెన్స్ రాజ్ కు ముగింపు పలికారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్