గొంతులో దోసె ఇరుక్కుని ఊపిరాడక వ్యక్తి మృతి

69చూసినవారు
గొంతులో దోసె ఇరుక్కుని ఊపిరాడక వ్యక్తి మృతి
TG: నాగర్‌కర్నూలు జిల్లాలో బుధవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కల్వకుర్తికి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి మద్యం సేవించి దోసె తిన్నాడు. అనంతరం గొంతులో దోసె ఇరుక్కుని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. స్థానికులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో మృతుడి కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్