ఢిల్లీ శివారులో దారుణ ఘటన వెలుగుచూసింది. ఎనిమిదేళ్ల కుమారుడిని గొంతునొక్కి తల్లి చంపింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీకి చెందిన పూనమ్ దేవి ఈ దారుణానికి పాల్పడింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కుమారుడిని హత్య చేసినట్లు ఒప్పుకుంది. అయితే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం గురించి తెలియడంతో కుమారుడిని ఆమె హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు.