హిండెన్బర్గ్, అదానీ గ్రూప్ల మధ్య వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. అదానీ సంస్థపై హిండెన్బర్గ్ కుట్రపూరితంగానే రిపోర్ట్ రిలీజ్ చేసిందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సెబీ ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అదానీ స్టాక్స్పై పెట్టుబడుల్లో తాము నిబంధనల్ని ఉల్లంఘించినట్లు అందులో పేర్కొన్నట్లు తెలిపింది. తాజా పరిణామాల్లో భాగంగా కోటక్ బ్యాంకును కూడా ఈ వ్యవహారంలోకి లాగడం గమనార్హం.