వైసీపీ మాజీ ఎమ్మెల్యే లంచం తీసుకున్నాడని ఫిర్యాదు

62చూసినవారు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే లంచం తీసుకున్నాడని ఫిర్యాదు
గుంటూరు: నరసరావుపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లంచం తీసుకున్నాడని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు చేశాడు. ఊడిచెర్లకు చెందిన లక్ష్మణ్ నాయక్ మీకోసం కార్యక్రమంలో ఎస్పీ మల్లికా గర్గ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంచర్ రహదారి కోసం రూ.50 లక్షలు డిమాండ్ చేయగా మధ్యవర్తి శివ రామకృష్ణకు రూ.30 లక్షలు, శ్రీనివాసరెడ్డికి రూ.20 లక్షలు ఇచ్చానన్నాడు. అయినా రహదారి ఇవ్వలేదని వాపోయాడు.

సంబంధిత పోస్ట్