కదులుతున్న రైలు ఎక్కబోయి వ్యక్తి మృతి

55చూసినవారు
కదులుతున్న రైలు ఎక్కబోయి వ్యక్తి మృతి
కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో జరిగింది. రైల్వే ఎస్సై వివరాల ప్రకారం..ధవళేశ్వరానికి చెందిన మహేష్ అనే వ్యక్తి రాజమండ్రి టు విజయవాడ వెళుతున్న ప్యాసింజర్ రైలులో ప్రయాణం చేస్తున్నాడు. సోమవారం ఉదయం తాడేపల్లిగూడెం స్టేషన్ లో మంచినీళ్ల కోసం రైలు దిగిన మహేష్.. కదులుతుండగా ఎక్కబోయి రైలు కింద పడి చనిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్