భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జీవో నం.3 శరాఘాతంగా నిలుస్తోందని ఆమె అన్నారు. ఈ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ జీవో ద్వారా మహిళలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుందని.. మహిళలకు న్యాయం జరిగే జీవో 41ను అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని కోరారు.