రోహిత్ శర్మ నేడు జరిగే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో అరుదైన గుర్తింపును సొంతం చేసుకోనున్నాడు. ఈరోజు సాయంత్రం రోహిత్ శర్మ 250వ ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాడు. 250 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన రెండో ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేయనున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు (256) ఆడిన రికార్డు మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉంది. 249 మ్యాచ్లతో ప్రస్తుతం రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్తో సమంగా ఉన్నాడు.