మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులను విసిగించిన నిర్మల్ జిల్లా వాసికి జైలు శిక్ష

57చూసినవారు
మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులను విసిగించిన నిర్మల్ జిల్లా వాసికి జైలు శిక్ష
మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులను విసిగించిన కేసులో నిర్మల్ జిల్లా వాసికి జైలు శిక్ష పడింది. రామ్ రెడ్డిపల్లెకు చెందిన శివరాత్రి లక్ష్మణ్ అనే వ్యక్తి మద్యం మత్తులో అకారణంగా డయల్ '100' కు ఫోన్ చేసి పోలీసులను విసిగించాడు. దీంతో తమ సమయాన్ని వృథా చేసినందుకు అతడిపై పోలీసులు న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. శుక్రవారం అతడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. 2 రోజుల జైలు శిక్ష విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్