రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణపై సమీక్ష

58చూసినవారు
రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణపై సమీక్ష
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు సంస్మరణ సభ కృష్ణా జిల్లా కానూరు వద్ద నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. ప్రముఖులు పెద్దఎత్తున సంస్మరణ సభకు రానున్న నేపథ్యంలో సభా ఏర్పాట్లు, భద్రత, మౌలిక వసతులు కల్పన, పార్కింగ్, తదితర అంశాలపై చర్చించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్