చిరుత దాడిలో మహిళ మృతి

64చూసినవారు
చిరుత దాడిలో మహిళ మృతి
చిరుత పులి దాడిలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం ఏపీలోని మహానంది సిరివెళ్ల మండలాల పరిధిలోని నల్లమల అడవి ప్రాంతంలో జరిగింది. పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ షేక్ మెహరున్ బి (40) కట్టెల కోసం అడవి ప్రాంతంలో వెళ్లగా చిరుత పులి తల భాగంలో దాడి చేసిందని, ఈ దాడిలో మృతి చెందిందని వారి బంధువులు తెలిపారు. చలమా రేంజ్ ఆఫీసర్ ఈశ్వరయ్య, డీఆర్ఓ రాజు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్