మహబూబ్నగర్ లో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 8 చోట్ల లీడ్లో కొనసాగుతున్నది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో ఆయనకు భంగపాటు తప్పేలా లేదు. ఇప్పటి వరకు ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 25,957 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.