రైలులో బిడ్డను ప్రసవించిన మహిళ

79చూసినవారు
రైలులో బిడ్డను ప్రసవించిన మహిళ
రైలులో ప్రయాణించిన నిండు గర్భిణి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గర్భిణి తన భర్తతో కలిసి నాసిక్‌ నుంచి సత్నాకు వెళ్లేందుకు ముంబై-వారణాసి మధ్య నడిచే కామాయని ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించింది. శుక్రవారం తెల్లవారుజామున ఆమెకు పురుటి నొప్పులు రావడంతో రైలులోనే ప్రసవించింది. అయితే తల్లిదండ్రులు ఆ శిశువుకు ఆ రైలు పేరే పెట్టడం విశేషం.

సంబంధిత పోస్ట్