జార్ఖండ్లోని దుమ్కా జిల్లా, మధుబన్ గ్రామంలో సోమవారం దారుణం జరిగింది. రేషన్ సరుకులను పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తూ మహిళా రేషన్ డీలర్కు చెప్పుల దండ వేసి స్థానికులు ఊరేగించారు. గోవింద్పూర్-సాహెబ్గంజ్ రాష్ట్ర హైవేను దాదాపు అరగంట సేపు దిగ్బంధనం చేశారు. మంగళవారం రేషన్ పంపిణీ చేయిస్తామని హామీ ఇచ్చి, వారిని శాంతింపజేసినట్లు గోపోకందర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి రంజిత్ మండల్ తెలిపారు.