తన తల్లి మందుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం లెనిన్నగర్ శివారులో జరిగింది. ఆకునూరుకు చెందిన యాకూబ్పాషా (29) సోమవారం రాత్రి 11 గంటలకు అమ్మ మందుల కోసం చేర్యాలకు వచ్చాడు. అక్కడ దుకాణాలు మూసి ఉండటంతో సిద్దిపేటకు బయలుదేరాడు. మార్గమధ్యలో లెనిన్నగర్ శివారులో నిర్మాణంలో ఉన్న వంతెన కాంక్రీటు గద్దెకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.