బైక్‌పై వంతెన దాటుతుండగా వరదలో చిక్కుకున్న యువకుడు.. చివరికి (వీడియో)

70చూసినవారు
భారీ వరద ప్రవాహం ఉన్న వంతెనను బైక్‌పై దాటేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ యువకుడు బైక్‌పై వంతెన దాటుతుండగా వాగు ఉధృతంగా పారడంతో కంట్రోల్ తప్పి కింద పడిపోయాడు. ఎలాగోలా బైక్‌తో పాటు బయటకు వద్దామనుకున్నా ప్రవాహం దాటికి రాలేకపోయాడు. వరద నీటిలో బైక్‌తో సహా కొంతదూరం కొట్టుకుపోయాడు. చివరికి బైక్‌ను వదిలేసి ఒడ్డుకు ఈదుకుంటూ రాగా స్థానికులు రక్షించారు.

సంబంధిత పోస్ట్