ఉత్తరప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లఖింపూర్ ఖేరీ మార్కెట్లో యువకుడు సుమిత్ మౌర్య (22) నడుచుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతాడు. ఈ క్రమంలో వెనుక నుండి వస్తున్న కారు ముందు పడిపోవడంతో.. కారు ఢీకొని సుమిత్ మరణించాడు. ఈ విషాద ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో వైరల్గా మారింది.