పిడుగుపాటుతో యువతి, యువకుడు మృతి

82చూసినవారు
పిడుగుపాటుతో యువతి, యువకుడు మృతి
పిడుగుపాటుకు ఓ యువతి, యువకుడు బలయ్యారు. హనుమకొండ(D) ఐనవోలు(M) వెంకటాపూర్‌లో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలు, ఇంటికి వెళ్తూ సమీపంలోని రేకుల షెడ్డు కిందకు చేరుకున్నారు. షెడ్డు పక్కనే ఉన్న చెట్టుపై పిడుగు పడటంతో యువరైతు కూకట్ల రాజు (25), ఆ పక్కనున్న ఇంటర్‌ విద్యార్థిని దౌత్‌బాజీ శ్రావణి (17) అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది కూలీలు షాక్‌ కొట్టినట్లు ఎగిరిపడ్డారు.

సంబంధిత పోస్ట్