ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) మే 8 నుంచి ప్రారంభం కానుందని ఆ సంస్థ తెలిపింది. 10న ముగియనున్న ఈ ఇష్యూలో రూ.3,000 కోట్లు సమీకరించాలని కంపెనీ నిర్దేశించుకుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 7న ఇష్యూ ప్రారంభం కానుంది. ఈ ఇష్యూ వివరాలను గురువారం బ్లాక్స్టోన్ సీనియర్ అధికారులు అమిత్ దీక్షిత్, ముకేష్ మెహతా, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఎండి రిషి ఆనంద్ మీడియాకు వెల్లడించారు.