ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేడు నిరసన కార్యక్రమం చేపట్టనుంది. దేశవ్యాప్తంగా ‘రాజ్యాంగాన్ని కాపాడండి. నిరంకుశత్వాన్ని పారదోలండి రోజు’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించనుంది. మరోవైపు కేజ్రీవాల్ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ సోమవారం సాధారణ వ్యక్తిలా ములాఖత్ జంగ్లాలో కలిసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.