పదో తరగతి విద్యార్థిని గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడో కామాంధుడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సురేష్ అనే వ్యక్తి పదో తరగతి విద్యార్థినికి కడుపు చేసి.. అబార్షన్ చేయించడంతో ఆమె గాంధీ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థిని తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు సుదర్శన్ పై ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు సుదర్శన్కు ఇది వరకే పెళ్లయి.. ఓ పిల్లాడు కూడా ఉండటం గమనార్హం.