ఏసీబీ దాడులు.. ఆర్టీవో ఉద్యోగుల్లో కలకలం

77చూసినవారు
ఏసీబీ దాడులు.. ఆర్టీవో ఉద్యోగుల్లో కలకలం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేయడంతో.. ఆర్టీవో అధికారులు, ఉద్యోగుల్లో కలకలం రేగింది. రవాణా శాఖపై ముఖ్యమంత్రికి వరుస ఫిర్యాదుల వస్తున్న నేపథ్యంలో ఏసీబీ ఈ రైడ్స్ చేపట్టింది. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అనిశా అధికారులు భారీ స్థాయిలో సొత్తును, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రవాణా కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు ఉండకూడదన్న నిబంధనలను చాలా ఆర్టీఓ కార్యాలయాలు అతిక్రమించాయని తనిఖీల్లో తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్