రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. ఒకరి మృతి

1068చూసినవారు
రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. ఒకరి మృతి
HYDలోని రామోజీ ఫిల్మ్ సిటీలో క్రేన్ ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షా మృతి చెందారు. ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్ వద్ద విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్ర‌మంలో క్రేన్‌ ద్వారా గెస్టులను కిందకు దించుతుండగా వైర్‌ తెగిపోయింది. దీంతో పలువురు కంపెనీ ప్రతినిధులు కిందపడిపోయారు. తీవ్రగాయాల‌పాలైన సంజయ్‌ షా అక్కడికక్కడే చనిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్