సింగరేణి జీడీకే-11 బొగ్గు గనిలో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బొగ్గును వెలికితీసే మిషన్ ఢీకొని ఎల్హెచ్డీ ఆపరేటర్ ప్రతాప్కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు రామగిరి మండలం పన్నూరుకు చెందిన ప్రతాప్ గా తోటి కార్మికులు తెలిపారు.