ప్రజాభవన్‌ బాంబు బెదిరింపు కేసులో నిందితుడు అరెస్ట్

61చూసినవారు
ప్రజాభవన్‌ బాంబు బెదిరింపు కేసులో నిందితుడు అరెస్ట్
హైదరాబాద్ ప్రజాభవన్‌‌కు నిన్న బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్‌కు చెందిన శివరామకృష్ణ అనే వ్యక్తి మద్యం మత్తులో ఈ ఫోన్ కాల్ చేసి బెదిరించినట్టు గుర్తించారు. శివరామకృష్ణను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కాగా నిన్న బాంబు బెదిరింపు కాల్ రాగా పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్