నటి కంగనా రనౌత్ గురువారం ఎంపీ హోదాలో తొలిసారి పార్లమెంట్లో మాట్లాడారు. ‘‘మండీ నియోజకవర్గంలో వివిధ కళారూపాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. హిమాచల్ లోని కత్-కుని అనే స్వదేశీ తయారీ సాంకేతికత ఉంది. గొర్రె చర్మాన్ని ఉపయోగించి జాకెట్లు, టోపీలు, శాలువాలు, స్వెటర్లు వంటి పలు రకాల దుస్తులు తయారు చేస్తారు. వీటి తయారీని ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సభలో చర్చించాలి’’ అని కంగన అన్నారు.