ఆదిలాబాద్ లోని మావల గ్రీన్వ్యాలీలోని శ్రీత్రిశక్తి దుర్గామాత ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీమహాకాళి, శ్రీమహాలక్ష్మీ, శ్రీమహా సరస్వతి చండీ హోమంలో భాగంగా గురువారం కలశాలతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. హేమలత రమేష్ శర్మ, బెజ్జవార్ రేణుక ఆధ్వర్యంలో చేపట్టిన ఈ శోభాయాత్రలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 21న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.