బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపికి లేదని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బీసీలకు బీజేపీ పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ కుమ్మరివాడ ఏరియాలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.