గణేష్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతం

68చూసినవారు
గణేష్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సమితి సభ్యులు బండారి వామన్, గెడం మాధవ్, పూసం ఆనంద్, కొత్తపల్లి సంజీవ్, మహిపాల్, రాజు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్