కారల్ మార్క్స్ ఆశయాలను నెరవేరిస్తేనే ఆయనకు నివాళులు అర్పించినట్లు అవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ సూచించారు. కార్మికుల కోసం, వారి సమస్యల పరిష్కారానికి పోరాడిన కార్ల్ మార్క్స్ మాటలను, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆదివారం కార్ల్ మార్క్స్ జయంతిని ఆదిలాబాద్ లోని సుందరయ్య భవనంలో సిపిఎం, సిఐటియు నాయకులు వేరువేరుగా ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.