జైనాథ్ మండల కేంద్రానికి చెందిన బోరి పవన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మాల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు బాధితుని ఆదివారం పరామర్శించారు. తమ వంతు సహాయంగా రూ. 31 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మనోధైర్యంతో ఉండాలని బాధితునికి సూచించారు. కుటుంబ సభ్యులు సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.