ఆదిలాబాద్ జిల్లా జైనథ్ వ్యవసాయం మార్కెట్ యార్డ్ లో మూడు రోజుల పాటు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ యార్డ్ సొసైటీ నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణంలో మార్పులు, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈనెల 27, 28, 29 మూడు రోజుల పాటు మార్కెట్ యార్డు ను మూసివేయడం జరుగుతుందని తెలిపారు. కావున రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.