వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి

81చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ను శనివారం ఆయన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. తాగునీటి సమస్య, వీధిదీపాలు తదితర వాటిని పరిష్కరించాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కౌన్సిలర్లు జహీర్ రంజాని, కలాల శ్రీనివాస్, సతీష్, సంద నర్సింగ్, వెంకన్న, రామ్ కుమార్, భూమన్న, ఇమ్రాన్, జఫర్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్