కాంగ్రెస్ పార్టీ రాష్టంలో అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతున్న, మరి పూర్తి చేస్తాం అన్న వాగ్దానాలు ఏమయ్యాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. హైదరాబాద్ లోని రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కేవలం మహిళలకు బస్సు ప్రయాణం తప్ప మరి ఇంకేది కూడా పూర్తి చేయలేదని అన్నారు.