త్వరలోనే భారత పౌరసత్వ జారీ ప్రక్రియ ప్రారంభం కానుందని కేంద్ర హోంశాఖ తెలిపింది. "నిబంధనలు ఇప్పటికే రూపొందించాం. ఈ ప్రక్రియను చేపట్టడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ను సైతం తయారు చేశాం. ప్రయాణ పత్రాలు లేకుండా భారత్లోకి అడుగు పెట్టిన వారు వచ్చిన ఏడాదిని చెబితే సరిపోతుంది. దరఖాస్తుదారులు మరే ఇతర పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగుస్తుంది." అని వెల్లడించింది.