మైనర్ బాలికపై అఘాయిత్యం.. ఉరిశిక్ష వేయాలని విద్యార్థుల ఆందోళన

76చూసినవారు
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలో ఓ మైనర్ బాలికపై అఘాత్యానికి పాల్పడిన సాగర్ అనే యువకుడిని బహిరంగంగా ఉరి శిక్ష వేయాలని కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శనివారం ఉదయం బురుగూడ గ్రామం వద్ద గల జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించిన పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు జిల్లా కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్