బేలా మండలంలోని జెడ్పిఎస్ఎస్ చప్రాల పాఠశాలలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల
విద్యార్థులు జెండాలను చేతపట్టుకుని
భారత్ మాతాకీ జై అంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. వివిధ ఆటలో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల సిబ్బంది బహుమతులను అందజేశారు.