అప్పుల బాధ తాళలేక రైలు కింద పడి వ్యక్తి మృతి

13986చూసినవారు
అప్పుల బాధ తాళలేక రైలు కింద పడి వ్యక్తి మృతి
బెల్లంపల్లి రాంనగర్ రైల్వేట్రాక్ పై రైలు కింద పడి ఇందిరానగర్ కు చెందిన గద్దల వెంకటేశ్ (32) అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్ తాపీమేస్త్రీగా పని చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఇటీవల మద్యానికి బానిస అయినా వెంకటేష్ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్