ఢిల్లీకి చెందిన ఓ మహిళ భర్త ఇటీవల ఓ ప్రమాదంలో మరణించాడు. అప్పటి నుంచి ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతోంది. ఆమె మానసిక స్థితి కూడా బాలేదని వైద్య రిపోర్టులో తేలింది. అప్పటికే ఆమె 27 వారాల గర్భవతి. ఈ తరుణంలో గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలంటూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ విచారించిన కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది.