కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని గానగాపూర్లో దత్తాత్రేయుని ఆలయం ఉంది. ఇక్కడ దత్తాత్రేయుడు పాదుకల రూపంలో దర్శనం ఇచ్చి భక్తులను కరుణిస్తాడు. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. దెయ్యాలు పట్టిన వారు ఈ ఆలయంలోకి ప్రవేశించిన మరుక్షణం.. అవి పారిపోతాయి. అయితే ఈ ఆలయంలో రెండు ఎత్తైన ఇనుప స్తంభాలు ఉన్నాయి. వాటిపై భక్తులు జుట్టు విరబూసుకుని రోదిస్తుంటారు. మహాహారతి ధ్వనులు వినిపించిన తర్వాత వారు శాంతిస్తారు.