ఎన్నికల నియమవళిని ఉల్లంఘించిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని తలమడుగు ఎస్ఐ ధనశ్రీ స్పష్టం చేశారు. గురువారం తలమడుగు లోని పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అక్రమంగా మద్యం విక్రయించినట్లయితే చర్యలు తప్పవు అని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో 50 వేల రూపాయల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే ఆధారంలో చూపించాలని లేనిపక్షంలో సీజ్ చేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.