గుర్తు తెలియని మృతదేహం లభ్యం

52చూసినవారు
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి రిజర్వాయర్ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం ఆదివారం గుర్తించారు. మండలంలోని తాంసి(కే) గ్రామానికి సంబంధించిన మేకల కాపరులు రిజర్వాయర్ ప్రాంతంలో ఆస్తి పంజరం కనిపించడంతో స్థానికులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై ప్రదీప్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్