నీటి ఎద్దడి తలెత్తకుండా పూర్తి చర్యలు

1554చూసినవారు
వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకోవాలని డిపిఓ శ్రీలత సూచించారు. తలమడుగు మండలంలో బుధవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. తలమగుడు, కొడద్ గ్రామాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం పంచాయితీలలో రికార్డులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతితో పాటు పన్ను వసూలు ప్రక్రియపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్