బిజెపి కార్యాలయం ప్రారంభం

56చూసినవారు
బిజెపి కార్యాలయం ప్రారంభం
బోథ్ మండల కేంద్రంలో నూతన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం నూతన పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తు ఎంపీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలో తీసుకెళ్లాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్