ఇచ్చోడ మండలంలోని జామిడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజర్షిషా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బడిఈడు పిల్లలను బడుల్లో చేర్పించాలని, బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం ఎర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు అందజేశారు. విద్యార్ధులతో ముచ్చటించారు.