గాలిదుమారం.. ఆస్తి నష్టం..
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఆస్తి నష్టం వాటిల్లింది. ఇచ్చోడ లోని ఎస్సీ కాలనీలో శనివారం గాలివాన బీభత్సంతో కల్లేపల్లి నడిపి గంగారం, కల్లేపల్లి గుండయ్య, కల్లేపల్లి పోశెట్టి లకు చెందిన ముగ్గురి ఇండ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయయి. ఇళ్లలోకి వర్షం నీరు చేరి ధాన్యం తడిసి పొయింది. తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.