పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గుడిహత్నూర్ మండల కేంద్రంలో పర్యటించారు. మండల కేంద్రానికి చెందిన ఎమ్మెల్యే అభిమాని కేంద్రే సంజు కోరిక మేరకు పాన్ షాప్ ను అనిల్ జాదవ్ శుక్రవారం సందర్శించారు. స్వయంగా ఎమ్మెల్యే స్వీట్ పాన్ తయారు చేసి అభిమాని కోరిక తీర్చారు.