గతంలో 79.84 శాతం పోలింగ్‌.. ఈసారి ఎంతో?

83చూసినవారు
గతంలో 79.84 శాతం పోలింగ్‌.. ఈసారి ఎంతో?
దేశంలో ఎక్కడున్నా ఈ సారి సొంతూరుకు వెళ్లి ఓటేయాలని ఆంధ్రా ఓటర్లు డిసైడయ్యారు. దీంతో బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. గతంలో 79.84శాతం మేర పోలింగ్‌ నమోదైంది. ఈసారి ఓటర్లు కూడా భారీగా తరలివస్తుండటంతో 83 శాతం పోలింగ్‌ జరిగే అవకాశముందని ఎన్నికల సంఘం భావిస్తోంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నిల పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేసింది. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 13న పోలింగ్‌ నిర్వహించనుంది.

సంబంధిత పోస్ట్