బోరు బావి మోటార్ల చోరికి పాల్పడుతున్న ముఠా అరెస్ట్

17032చూసినవారు
బోరు బావి మోటార్ల చోరికి పాల్పడుతున్న ముఠా అరెస్ట్
బోరు బావి మోటార్ల చోరికి పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను జైపూర్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. మందమర్రి మండలం గుడిపెల్లికి చెందిన కుమ్మరి వెంకటేష్, కామెర రాజ్ కుమార్, సల్లూరి రాకేష్ కొంతకాలంగా నూతనంగా నిర్మించే ఇళ్లు లక్ష్యంగా చేసుకుని బోరుబావిలోని మోటార్లను దొంగిలిస్తున్నారు. రసూల్ పల్లి బస్టాండ్ వద్ద వారిని పట్టుకొని మోటార్లు, కేబుల్ వైర్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మోహన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్