జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

59చూసినవారు
జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య
మందమర్రికి చెందిన మామిడాల తిరుపతి (32) జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మందమరి సీఐ తెలిపారు. గత ఏడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలుకు గాయం అయింది. దీంతో మద్యానికి బానిస అయ్యాడు. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో తండ్రి కూడా మృతి చెందాడు. ప్రమాదానికి గురి కావడంతో పెళ్లి కూడా కాలేదు. ఈ క్రమంలో మానసికంగా కుంగి పోయాడు. మద్యం మత్తులో ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్